కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు: ఎంపీ కోమటిరెడ్డి

  • సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారు
  • కేంద్రంలో మోదీ పాట, రాష్ట్రంలో ఒవైసీ పాట పాడుతున్నారని ఎద్దేవా
  • కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయొద్దు
కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయడం లేదని అన్నారు. ఈ రోజు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కేంద్రంలో మోదీ పాట, రాష్ట్రంలో ఒవైసీ పాట పాడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయలేమని కేటీఆరే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Congress
Komatireddy Venkatareddy
TRS
Telangana

More Telugu News