టీమిండియా, శ్రీలంక టీ20 మ్యాచ్ రద్దు

టీమిండియా, శ్రీలంక మధ్య గౌహతిలో జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ కు టాస్ వేసినా వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ కు ముందు మొదలైన వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20  మ్యాచ్ ఎల్లుండి ఇండోర్ లో జరగనుంది.
Go Back to Shorts
India
Sri Lanka
T20
Guwahati

More Telugu News