బాగ్దాద్ లోని అమెరికా ఆస్తులపై బాంబుల వర్షం... ట్రంప్ సీరియస్!
- సులేమాని హత్య తరువాత మారిన పరిస్థితి
- యూఎస్ ఎంబసీ సమీపంలో పడ్డ రాకెట్లు
- పారా మిలిటరీ కాన్వాయ్ పై దాడి
- దీటైన బదులిస్తామని ట్రంప్ హెచ్చరిక
ఇక ఈ దాడులకు తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోసారి దాడి చేస్తే, అత్యంత వేగంగా, గట్టిగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోమని ఆయన అన్నారు. ఇరాన్ లోని 52 ముఖ్యమైన ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని రాకెట్లను గురి పెట్టి ఉంచామని, ఇంకోసారి తమ ఆస్తులపై దాడి చేస్తే, వాటన్నింటినీ ఒకేసారి ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు.