నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు

  • భువనేశ్వరి గాజు విరాళంపై విమర్శలు
  • చివరి రోజుల్లో తన తండ్రికే అన్నం పెట్టలేదు
  • రైతులకు పరమాన్నం పెడతారట
అమరావతి పరిరక్షణ సమితికి తన బంగారు గాజును విరాళంగా ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, భువనేశ్వరిపై ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ సెటైర్లు విసిరారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Telugudesam
YSRCP
Roja

More Telugu News