హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత

  • డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
  • 50గ్రా. హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం
  • న్యూ ఇయర్ పార్టీల కోసం డ్రగ్స్ ను తెచ్చినట్లు వెల్లడి
హైదరాబాద్ శివార్లలో భారీ స్థాయిలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. కుషాయిగూడలోని ఓ హోటల్ లో ఈ డ్రగ్స్ ను సీజ్ చేసి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు మల్కాజ్ గిరి ఎస్ వోటీ పోలీసులు తెలిపారు. వీరి నుంచి 150 గ్రాముల హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కీసర, జవహర్ నగర్, కుషాయిగూడ పీఎస్ పరిధిలో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ పార్టీల కోసం డ్రగ్స్ ను ఈ ముఠా హైదరాబాద్ కు తెచ్చినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. రేవ్ పార్టీలు, పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Go Back to Shorts
Drugs seize
Hyderabad
Telangana

More Telugu News