తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ వెంకటరాములు.. హెచ్చార్సీ ఛైర్మన్ గా బి.చంద్రయ్య నియామకం

  • ఉపలోకాయుక్తగా నిరంజన్ రావు
  • హెచ్చార్సీ సభ్యులుగా ఆనందరావు, ఇర్ఫాన్ మొయినుద్దీన్ 
  • గవర్నర్ ఉత్తర్వులు జారీ
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా బి.చంద్రయ్య నియామకం అయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీచేశారు. మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా ఎన్.ఆనందరావు, ఇర్ఫాన్ మొయినుద్దీన్ ను నియమించారు. ఈ నియామకాలకు సంబంధించి కమిటీ సిఫారసుల మేరకు వీరిని నియమించినట్లు గవర్నర్ తెలిపారు. కాగా, తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ వెంకటరాములు నియమితులయ్యారు. ఉపలోకాయుక్తగా నిరంజన్ రావును నియమిస్తూ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.
Go Back to Shorts
Telangana HRC Chairman B.Chandraiah
Lokayuktha justice Venkata Ramulu

More Telugu News