అక్రమాస్తుల కేసులో సిద్ధిపేట డీసీపీ నర్సింహారెడ్డి అరెస్టు
- రూ.10కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారుల వెల్లడి
- 14 రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- చంచల్ గూడ జైలుకు తరలింపు
గోల్కొండలో నర్సింహారెడ్డికి ఖరీదైన విల్లా ఉందని తేల్చారు. శంకర్ పల్లి, గొల్లపల్లి, జహీరాబాద్ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఉన్నాయని గుర్తించగా, సిద్దిపేట, మహబూబ్ నగర్ లో 20 ఎకరాల వ్యవసాయ భూమిని కలిగివున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అరెస్టు చేసిన నర్సింహారెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ ను విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నర్సింహారెడ్డిని చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు.