ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారమా?: మంచు లక్ష్మి

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • స్పందించిన మంచు లక్ష్మి
  • ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలంటూ ఆకాంక్ష
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి స్పందించారు. దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్ కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ తీరనిదని తెలిపారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Manchu Lakshmi
Tollywood
Disha
Police
Hyderabad
Telangana

More Telugu News