కేసు నమోదుకు దిశ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది: లోక్ సభలో ఉత్తమ్ కుమార్
- జాతీయ రహదారుల వద్ద మద్యం అమ్మకూడదు
- భద్రత అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది
- తెలంగాణ మద్యం పాలసీ బాగోలేదు
మొదటి స్టేషన్ లోనే వారు కేసు నమోదు చేసుకొని ఉంటే, ఆ అమ్మాయి ప్రాణాలు దక్కేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జాతీయ రహదారుల వద్ద మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. భద్రత అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. తెలంగాణ మద్యం పాలసీ బాగోలేదని చెప్పారు. ఈ కారణాల వల్లే ఇటువంటి ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సరికావని విమర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.