కేసీఆర్ మాటలు అవాస్తవం, ఆక్షేపణీయం: బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- చార్జీల పెంపుతో పేదలపై భారం మోపడం తగదు
- ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా నిలిచింది
- రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ ఛిన్నాభిన్నం చేశారు
దేశంలో ఎక్కడా లేనివిధంగా రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని గొప్పలు చెబుతున్న కేసీఆర్ ఇప్పుడు రెవెన్యూ నూతన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. ఆయన తీరుతో రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ తమపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ తొలి నుంచీ అండగా ఉందని అన్నారు. వారి సమస్యలను, రాష్ట్రంలోని పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.