panyam: కాటసాని పాదయాత్రలో అపశ్రుతి.. అనుచరుల వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలు!

  • శ్రీశైలంకు పాదయాత్ర చేస్తున్న కాటసాని
  • పాదయాత్ర ముందు వెళ్తున్న కాటసాని వాహనం
  • వాహనం బోల్తా ఘటనలో అనుచరులకు గాయాలు 
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి అనుచరుల వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా, నాలుగు రోజుల క్రితం యాగంటి నుంచి శ్రీశైలంకు కాటసాని పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముందు వెళ్తున్న కారులో కాటసాని అనుచరులు ప్రయాణిస్తున్నారు.
panyam
mla
katasani Ram bhupal reddy
srisailam

More Telugu News