సకల జనుల దీక్ష గ్రాండ్ సక్సెస్: అశ్వత్థామరెడ్డి
- ఆర్టీసీ మహిళా కార్మికుల తోడ్పాటుతో సాధ్యమైందని వెల్లడి
- ట్యాంక్ బండ్ పై మహిళలపై దాడి అమానుషం అంటూ వ్యాఖ్యలు
- రేపు అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్న అశ్వత్థామ
ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా సంఘాలు తోడ్పడ్డాయని తెలిపారు. మద్దతిచ్చిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాలకు జేఏసీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ట్యాంక్ బండ్ పై మహిళలపై జరిగిన దాడిపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నిరసనగా రేపు ఉదయం అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు.