ప్రతిభకు గుర్తింపు... బుమ్రా, స్మృతి మంధన విజ్డెన్ పురస్కారాలకు ఎంపిక

  • విజ్డెన్ అవార్డుల ప్రకటన
  • ఈ ఏడాది ఐదుగురికి అవార్డులు
  • భారత్ నుంచి బుమ్రా, స్మృతి ఎంపిక
క్రికెట్ లో విజ్డెన్ అవార్డులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇతర రంగాల్లో నోబెల్ అవార్డులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రికెట్ రంగంలో విజ్డెన్ పురస్కారాలను అంత గౌరవంగా భావిస్తారు. ఇప్పుడీ విశిష్ట పురస్కారాలకు భారత్ నుంచి టీమిండియా సంచలన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళల క్రికెట్ చిచ్చరపిడుగు స్మృతి మంధన ఎంపికయ్యారు. ఈ మేరకు విజ్డెన్ ఇండియా ఓ ప్రకటన చేసింది.

ఈ ఏడాది అవార్డులు అందుకోబోతున్న వారిలో పాకిస్థాన్ ఆటగాడు ఫకర్ జమాన్, శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నే, ఆఫ్ఘనిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ కూడా ఉన్నారు. ఇటీవల డబుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గురించి విజ్డెన్ ఇండియా మ్యాగజైన్ తాజా ఎడిషన్ లో ప్రముఖంగా పేర్కొన్నారు.
Go Back to Shorts
Bumrah
Mandhana
Wisden
India

More Telugu News