దెయ్యం ఉందని నిరూపిస్తే నగదు బహుమతి ఇస్తానన్న కలెక్టర్!

భారత్ లో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్న సంగతి తెలిసిందే. ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రజల్లో దెయ్యం, చేతబడి వంటి నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. అయితే, ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులాంగే ఓ ప్రకటన చేశారు. ఎవరైనా దెయ్యాలు ఉన్నాయని ఆధారాలతో సహా వస్తే వారికి రూ.50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. దెయ్యాన్ని చూపించినవారికి తన సొంత డబ్బులే ఇస్తానని తెలిపారు. ప్రజల్లో మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పట్ల భయాలను పోగొట్టడానికి విజయ్ కులాంగే ఈ ప్రయత్నం చేస్తున్నారు. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని, నాటు వైద్యాలు, ఇతర మంత్రవిద్యలను ఆశ్రయించరాదని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News