Nandini: ఐపీఎల్ 2026: ఆర్‌సీబీతో జతకట్టిన 'నందిని'

Nandini Partners with RCB for IPL 2026 Season
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ముందుకొచ్చింది. కేఎంఎఫ్‌కు చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ 'నందిని', రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు అధికారిక డెయిరీ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. మంగళవారం ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుండగా, గతేడాది (2025) టైటిల్ విజేతగా ఆర్‌సీబీ ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతోంది.

ఈ సందర్భంగా కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బి. శివస్వామి మాట్లాడుతూ.. "రాష్ట్రానికి చెందిన రెండు ప్రతిష్ఠాత్మక బ్రాండ్లు అయిన నందిని, ఆర్‌సీబీ చేతులు కలపడం సంతోషంగా ఉంది. క్రీడలను, యువతను ప్రోత్సహించాలనే మా లక్ష్యంలో ఇది ఒక భాగం. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ అభిమానులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం" అని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఐపీఎల్ సీజన్ అంతటా 'నందిని' ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఇదిలా ఉండగా, ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పటిష్ న భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. మార్చి 28, ఏప్రిల్ 5వ తేదీల్లో జరగనున్న మ్యాచ్‌ల కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు మంగళవారం మీడియా సమావేశంలో ఆయన వివరించారు.

ప్రజలందరూ సహకరించాలని కోరిన కమిషనర్, చెల్లుబాటయ్యే డిజిటల్ టికెట్లు ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. టికెట్లు లేని వారు స్టేడియం పరిసరాల్లో గుమిగూడటానికి వీల్లేదని హెచ్చరించారు. మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసే సమయంలోనే రుసుము చెల్లించి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చని, ప్రేక్షకులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Nandini
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Karnataka Milk Federation
KMF
B Shivaswamy
Chinnaswamy Stadium
Bengaluru Police
IPL Matches

More Telugu News