నేటి రాత్రి విశాఖకు గవర్నర్.. రేపు ఏయూలో కార్యక్రమానికి హాజరు
- నేటి రాత్రి విమానంలో విశాఖకు
- రాత్రికి సర్క్యూట్హౌస్లో బస
- కార్యక్రమం అనంతరం రేపు విజయవాడకు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేటి రాత్రి విశాఖపట్టణానికి రానున్నారు. రాత్రికి సర్క్యూట్ హౌస్లో బస చేసి, రేపు ఉదయం ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రోలియం వర్సిటీ) వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. ఒంటి గంటకు కార్యక్రమం ముగిసిన అనంతరం సర్క్యూట్హౌస్కు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు పయనమవుతారు.