టీఎస్సార్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలి: కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
- ఉద్యోగుల ఆందోళనలను సానుభూతితో అర్థం చేసుకోవాలి
- కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు
- ఉద్యోగులపై ఉదారత చూపాలని సీఎం కేసీఆర్ కు వినతి
నాడు సకలజనుల సమ్మెలో భాగంగా తెలంగాణ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తుచేశారు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగసంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామని, ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా వుందని అన్నారు. ఉద్యోగులపై ఉదారత చూపి, టీఎస్సార్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.