కొట్టుకుపోయిన జలాశయం గేటు...వృథాగా పోతున్న నీరు
- ఉమ్మడి నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు వద్ద ఘటన
- తెగి పోయిన ఆరో నంబరు గేటు
- పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన
దీంతో జలాశయంలో నీరు వృథాగా నదిలోకి వెళ్లిపోతోంది. ఘటన జరిగిన సమయానికి జలాశయంలో 4.3 టీఎంసీల నీరుంది. జలాశయం సామర్థ్యం 645 అడుగులు కాగా 644.5 అడుగుల మేర నీరుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని 42 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు సాగవుతోంది.
డెడ్ స్టోరేజీ గేటు కొట్టుకు పోవడంతో జలాశయంలో నీరు అడుగంటే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం తెలియడంతో మంత్రి జగదీశ్రెడ్డి ఘటనపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.