జగన్ పాలనపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు విమర్శలు!

  • సచివాలయ వ్యవస్థ అవసరమా?
  • 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకు?
  • ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు విమర్శలు గుప్పించారు. సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని అడిగారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఇటీవలే అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Jagan
YSRCP
Nadendla Bhaskara Rao

More Telugu News