హౌడీ హ్యూస్టన్... పలకరించిన నరేంద్ర మోదీ!
- ట్విట్టర్ లో స్పందించిన మోదీ
- నగరం ప్రశాంతంగా ఉందని వ్యాఖ్య
- హ్యూస్టన్ ను ఎనర్జిటిక్ సిటీగా అభివర్ణన
ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "హౌడీ హ్యూస్టన్. ఈ మధ్యాహ్నం చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నగరంలో నేను ఇవాళ, రేపు ఉంటాను. ఇది డైనమిక్, ఎనర్జిటిక్ సిటీ" అని అభివర్ణించారు. 'హౌడీ మోదీ' కార్యక్రమంలో దాదాపు 400 మంది కళాకారులు పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.