CPI: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

  • కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న రామకృష్ణ
  • సీమలో చేపట్టే అభివృద్ధి పనులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్
  • ఇతర పార్టీల నేతల సూచనలు, సలహాలు స్వీకరించాలని వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాయలసీమలో చేపట్టే అభివృద్ధి పనులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశం నిర్వహించడంతో సరిపెట్టకుండా, అఖిలపక్ష నేతల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
CPI
Ramakrishna
Jagan

More Telugu News