బ్లాక్ అండ్ వైట్ ఫ్రిల్ గౌన్ లో మెరిసిపోయిన ప్రియాంకా చోప్రా!
- టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం
- 'ది స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శన
- కార్యక్రమానికి హాజరైన చిత్ర యూనిట్
తనతో పాటు సినిమాలో నటించిన ఫర్హాన్ అక్తర్, సినిమా దర్శకురాలు సోనాలీ బోస్ తో కలిసి ప్రియాంక ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక సినిమా ప్రదర్శన అనంతరం ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. 15 సంవత్సరాల వయసులోనే రైటర్ గా పేరు తెచ్చుకుని, మరణించిన ఆయేషా చౌదరి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా, ఆయేషా తల్లిదండ్రులుగా ప్రియాంక, ఫర్హాన్ అక్తర్ లు నటించారు. ఈ పాత్రలో నటించడం తనకు చాలా కష్టమైందని కూడా ప్రియాంక వ్యాఖ్యానించింది.