Bandla Ganesh: ఆ ముగ్గురి విషయంలో నేను ప్రతి రోజు శీల పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు: బండ్ల గణేశ్

  • నా తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం
  • ఈ ముగ్గురి విషయంలో వాదనలు అనవసరం
  • నో మోర్ డిస్కషన్స్
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను తన దేవుడుగా ఎప్పుడూ చెప్పుకునే బండ్ల గణేశ్... మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ అంటే తనకు ఎప్పుడూ ప్రాణమేనని ట్వీట్ చేశారు. తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ విషయంలో తాను ప్రతి రోజు శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ముగ్గురి విషయంలో వాదనలు అనవసరమని... నో మోర్ డిస్కషన్స్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.  
Bandla Ganesh
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News