అనుచరుడి చెంప ఛెళ్లుమనిపించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య!
- కర్ణాటకలోని మైసూరులో ఘటన
- మీడియాతో మాట్లాడుతున్న సిద్ధూ
- ఫోన్ లో మాట్లాడాలని అనుచరుడి ఒత్తిడి
ఓ విషయంలో ప్రభుత్వాధికారులతో మాట్లాడి సిఫార్సు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సదరు అనుచరుడు మొబైల్ ఫోన్ ను సిద్ధరామయ్య చెవి వద్ద పెట్టబోయాడు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధూ కోపంతో సదరు అనుచరుడి చెంప పగలగొట్టారు.
అనంతరం చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.