గగన్ యాన్ ప్రాజెక్టు.. భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్న రష్యా!
- 2021 నాటికి చేపట్టనున్న భారత్
- నలుగురు వ్యోమగాములకు రష్యాలో శిక్షణ
- మాస్కోలో ఇస్రో స్పెషల్ యూనిట్ ఏర్పాటు
2021, డిసెంబర్ లోపు జీఎస్ఎల్వీ మార్క్-3 నౌక ద్వారా ఈ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామనీ, వీరంతా అక్కడే ఓ మాడ్యుల్ లో 5 నుంచి 7 రోజులు గడుపుతారని సమాచారం. అనంతరం ఈ మాడ్యుల్ బంగాళాఖాతంలో సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. రష్యాలో 15 నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్నాక భారత్ లో మరో 6-8 నెలలు అడ్వాన్స్ డ్ శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గగన్ యాన్ ప్రాజెక్టు కోసం మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఇస్రో ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతరిక్షంలో విహరించిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మను సైతం రష్యానే అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.