Andhra Pradesh: చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందే!: విజయసాయిరెడ్డి సెటైర్

  • తిరుమలలో అన్యమత ప్రచారం రగడ
  • టీడీపీ హయంలోనే టికెట్ల ముద్రణ జరిగిందన్న సాయిరెడ్డి
  • ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు బాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం
తిరుమలపై ఆర్టీసీ టికెట్ల ద్వారా అన్యమత ప్రచారం జరుగుతోందని ప్రతిపక్ష టీడీపీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాలకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను టీడీపీ హయాంలోనే ముద్రించారని విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 3 నెలలకే ఇంతలా బట్టలు చించుకుంటే చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. ఏదేమైనా చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనని సెటైర్ వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
mental hospital
Vijay Sai Reddy
Twitter

More Telugu News