పదేళ్ల ఎదురుచూపులకు ఫలితం.. తప్పి పోయిన తల్లి ఇల్లు చేరిన వైనం!
- మతి స్థిమితం కోల్పోయి ఇల్లు విడిచిన తల్లి
- ఉత్తరప్రదేశ్లో పిల్లలను కిడ్నాప్ చేస్తోందంటూ పోలీసులకు అప్పగించిన స్థానికులు
- ఆమె దైన్యాన్ని చూసి చలించిపోయిన పోలీసులు
అతడి ఆశను నిజం చేస్తూ ఆ తల్లి మళ్లీ కొడుకు దగ్గరికి చేరింది. తల్లిని చూసిన అతడి మనసు ఉప్పొంగిపోయింది కళ్ల వెంట అప్రయత్నంగానే నీళ్లు వచ్చాయి. గుజరాత్లోని సఖేడాకు చెందిన శాంతాబాయి కథ ఇది. ఉత్తరప్రదేశ్లోని శంషాబాద్లో పిల్లలను కిడ్నాప్ చేస్తోందన్న అనుమానంతో స్థానికులు ఓ మహిళపై దాడిచేసి అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమెను చూసి చలించిపోయిన పోలీసులు మెల్లిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమారుడు మహేంద్రకు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే శంషాబాద్ వెళ్లిన మహేంద్రను గుర్తుపట్టిన ఆ తల్లి కుమారుడిని హత్తుకుంది. తల్లిని చూసిన కుమారుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.