ఇది మా అంతర్గత వ్యవహారం: చైనా వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన భారత్
- ఆర్టికల్ 370 రద్దుపై చైనా అసహనం
- ప్రతిస్పందించిన భారత విదేశాంగ శాఖ
- ఇతర దేశాలు వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ కోరుకోవడంలేదని వెల్లడి
జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు-2019ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, లఢఖ్ ప్రాంతాన్ని సరికొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో పొందుపరిచారని రవీష్ కుమార్ వివరించారు. ఈ నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం అని చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. భారత్ పాలన పరమైన అంశాల్లో చైనా స్పందనలకు తావులేదని ఆయన చెప్పకనే చెప్పారు. భారత్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని, వ్యాఖ్యలు చేయదని, ఇతర దేశాలు కూడా తన పట్ల అలాగే ఉండాలని భారత్ కోరుకుంటుందని రవీష్ కుమార్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.