ఖాకీవనంలో కర్షకుడు...సెలవురోజున పొలంలోనే పోలీస్ బాస్
- వ్యవసాయం అంటే మక్కువ అంటున్న ఏఎస్పీ రామనరసింహారెడ్డి
- తాను అధికారిని అయ్యేందుకు సాయపడిందని కృతజ్ఞత
- మక్కువ పెంచుకుంటే సాగు సులభమేనని సూచన
దాదాపు 32 ఏళ్ల క్రితం ఎస్ఐగా పోలీసు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఏఎస్పీ స్థాయికి ఎదిగినా వారానికి ఓరోజు వ్యవసాయం చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. ఈ ఆదివారం కూడా అలాగే స్వగ్రామానికి వచ్చారు. ఉదయాన్నే కాడెడ్లకు నాగలికట్టి పొలంబాటపట్టి, గొర్రు తోలారు. నారుమోసి కూలీలతో కలిసి నాట్లు వేశారు.
అంతేకాదు కేఎస్ఆర్ ట్రస్టు, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకునిగా సోదరుడు కటంగూరి శ్రీరాంరెడ్డితో కలిసి రైతులకు పలురూపాల్లో సేవలందిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడు బస్సులలో రైతులను తీసుకువెళ్లి చూపించారు.