ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు
- ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల
- ఈ నెల 26న పోలింగ్
- పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
కాగా, ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి, తెలంగాణలో యాదవరెడ్డి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునే నిమిత్తం ఈ నోటిఫికేషన్ జారీ అయింది. గతంలో టీడీపీ నుంచి కరణం బలరాం, వైసీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్సీలుగా ఉండేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా గెలుపొండంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి పార్టీ ఫిరాయించడంతో ఆయనపై వేటు పడింది. దీంతో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది.