Andhra Pradesh: పరిటాల రవి హత్య తర్వాత ఎక్కడ, ఎన్ని బస్సులు తగలబెట్టాలో చంద్రబాటు టార్గెట్లు పెట్టారు!: విజయసాయిరెడ్డి

  • విధ్వంస, హింసా రాజకీయాలకు బాబే ఆద్యుడు
  • బాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు
  • ఘాటు విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
విధ్వంస రాజకీయాలు, హింసకు ఆద్యుడు చంద్రబాబేనని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. పరిటాల రవి హత్య అనంతరం జిల్లాలకు ఫోన్లు చేసి ఎక్కడ ఎన్ని బస్సులు తగలబెట్టాలో చంద్రబాబు టార్గెట్లు పెట్టారని ఆరోపించారు. ఎవరెవరిపై దాడులు చేయాలో కూడా చంద్రబాబే చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారుతారని ఘాటుగా విమర్శించారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’ అని దుయ్యబట్టారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News