అమెరికాలో నాజీ ఉన్మాది కిరాతకం.. 419 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు!
- వర్జీనియాలోని చార్లొట్ విల్లేలో ఘటన
- జనరల్ ఈలీ విగ్రహం తొలగింపునకు నిరసనగా ర్యాలీ
- ఆందోళనకారులను కారుతో తొక్కించిన జేమ్స్
తాజాగా ఈ కేసును విచారించిన ఓ న్యాయస్థానం జేమ్స్ అలెక్స్ కు యావజ్జీవంతో పాటు 419 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అమెరికాలో బానిసత్వం రద్దుకు వ్యతిరేకంగా పోరాడిన జనరల్ రాబర్ట్ ఈలీని శ్వేత జాత్యహంకారులు హీరోగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా శ్వేతజాతీయులు ఉద్యమించారు. మరోపక్క విగ్రహాన్ని తొలగించాలని మరికొందరు ఆందోళన చేశారు. ఇది జేమ్స్ కు ఆగ్రహం తెప్పించింది. 2017 ఆగష్టు 12న జరిగిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సుదీర్ఘంగా వాదనలు విన్న కోర్టు.. యావజ్జీవంతో పాటు 419 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.