జరుగుతున్నవాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు: యెడ్యూరప్ప

  • జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసు
  • ఏం జరుగుతుందో వేచి చూద్దాం
  • కుమారస్వామి, సిద్ధరామయ్య వ్యాఖ్యలపై మాట్లాడను
కాంగ్రెస్-జేడీఎస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. బీజేపీనే ఇదంతా చేయిస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను తుమకూరుకు వెళ్తున్నానని, సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తానని అన్నారు. 'మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీకు తెలుసు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కుమారస్వామి, సిద్ధరామయ్యల వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడదలుచుకోలేదు. జరుగుతున్న దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు' అని చెప్పారు.
Go Back to Shorts
Yeddyurappa
BJP
JDS
Congress
Kumaraswamy
Siddaramaiah
Karnataka

More Telugu News