విజయసాయి పదవి ఆ కోవలోకి రాదు.. ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్!
- గత నెలలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
- నియామకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం
- ప్రజాప్రతినిధుల అనర్హత చట్ట సవరణపై ఆర్డినెన్స్
గత నెలలో ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైసీపీ నియమించింది. అయితే అది లాభదాయక పదవుల పరిధిలోకి వస్తుందని ఆయన నియామకాన్ని ప్రభుత్వం రెండు రోజుల క్రితం రద్దు చేసింది. నేడు ప్రజాప్రతినిధుల అనర్హత చట్ట సవరణపై ఆర్డినెన్స్ను ప్రభుత్వం తీసుకు రావడంతో విజయసాయిరెడ్డికి లైన్ క్లియర్ అయింది.