Vijay Sai Reddy: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం

  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్న ఏపీ సర్కారు
  • విజయసాయికి క్యాబినెట్ హోదా!
వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాజా నియామకంతో ఇకపై విజయసాయికి క్యాబినెట్ మంత్రి హోదా లభించనుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి ఇప్పటికే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Vijay Sai Reddy
Andhra Pradesh
YSRCP
New Delhi

More Telugu News