టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల పరిస్థితిని నాయకులు చంద్రబాబుకు వివరించారు.

కాగా, ఈ నెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇతర నేతలకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అంతేగాకుండా, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రస్తుత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News