ఏపీ భవన్ లో జగన్ కు వేదపండితుల ఆశీర్వచనం

ఢిల్లీలో ప్రధాన నరేంద్ర మోదీని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వైసీపీ శాసనసభా పక్ష నేత జగన్ కలిశారు. అనంతరం, ఏపీ భవన్ కు వెళ్లిన జగన్ కు అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జగన్ కు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. జగన్ వెంట ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు.


More Telugu News