KTR: ప్రజల దీవెనలు వెల్లువెత్తాయి... జగన్ గారి కష్టం ఫలించింది: కేటీఆర్

  • ట్వీట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • అఖండ విజయంగా పేర్కొన్న వైనం
  • అంతా మంచి జరగాలంటూ ఆకాంక్ష
ఏపీలో వైసీపీ ఘనవిజయం ముంగిట నిలిచిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. "వెల్లువలాంటి ప్రజల దీవెనలతో మీ కష్టం ఫలించింది జగన్ గారూ. మా తోబుట్టువు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
KTR
Jagan
Andhra Pradesh

More Telugu News