పంత్ ను కాకుండా దినేశ్ కార్తీక్ ను తీసుకోవడానికి కారణం ఇదే: కోహ్లీ
- దినేశ్ కార్తీక్ కు ఎక్కువ అనుభవం ఉంది
- క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడగలడు
- మ్యాచ్ ఫినిషర్ గా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది
దినేశ్ కార్తీక్ కు చాలా అనుభవం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా ఉందని... ఈ నేపథ్యంలోనే పంత్ ను కాదని అతన్ని సెలెక్ట్ చేశామని కోహ్లీ తెలిపాడు. వికెట్ కీపర్ గా ధోనీ వ్యవహరిస్తాడని... అనివార్య కారణాల వల్ల ధోనీ ఏదైనా మ్యాచ్ లో ఆడలేకపోతే దినేశ్ కార్తీక్ జట్టులోకి వస్తాడని చెప్పాడు. మ్యాచ్ ఫినిష్ చేయడంలో కార్తీక్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపాడు.