ఐఐటీ మద్రాస్‌కూ పాకిన ఐపీఎల్ ఫీవర్.. టాస్ గెలిస్తే ధోనీ ఏం చేస్తాడంటూ విద్యార్థులకు ప్రశ్న!

  • ‘మెటీరియల్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌’ పరీక్షలో ప్రశ్న
  • పిచ్‌పై తేమ, వాతావరణ పరిస్థితిని వివరిస్తూ ప్రశ్న అడిగిన వైనం
  • ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఐసీసీ
ఐపీఎల్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్-1లో ముంబైతో తలపడిన చెన్నై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోజు దేశంలోనే పేరెన్నికగన్న మద్రాస్ ఐఐటీ ‘మెటీరియల్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌’ పరీక్షలో విద్యార్థులకు సంధించిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని టాస్‌ గెలిస్తే ఎం చేస్తాడు? అనేదే ఆ ప్రశ్న. ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ విద్యార్థులకు ఈ ప్రశ్నను సంధించి ఆశ్చర్యపరిచారు. చెన్నైలోని వాతావరణ పరిస్థితులు, మైదానంలో పిచ్‌పై ఉండే తేమ గురించి వివరిస్తూ.. ఈ పరిస్థితుల్లో టాస్ గెలిస్తే ధోనీ ఏంచేయాలని ప్రశ్నించారు. బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేక బౌలింగ్ తీసుకోవాలా? అన్న ఈ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కూడా దీనిని షేర్ చేసింది.
Go Back to Shorts
IIT Madras
Chennai
CSK
Question paper
MS Dhoni

More Telugu News