Andhra Pradesh: ఒక్కసారిగా కూలిన మట్టిపెళ్లలు.. తునిలో శిథిలాల కింద ఇద్దరు కార్మికులు!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. తునిలోని తాండవ నదిలో కార్మికులు మట్టిని తవ్వుతుండగా, ఒక్కసారిగా మట్టి పెళ్లలు విరిగి మీద పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు శ్రీనివాసకుమార్, సత్తిబాబు అనే ఇద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
East Godavari District
tuni
accident

More Telugu News