మరో 10 గంటల్లో పెరగనున్న ఫణి తుపాను తీవ్రత: విశాఖ వాతావరణ శాఖ

  • రాగల 12 గంటల్లో బలపడనున్న తుపాను
  • తమిళనాడు, కోస్తాంధ్ర సమీపంలో కేంద్రీకృతం
  • గంటకు 45-50 కి.మీ. వేగంతో గాలులు
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
మరో 10 గంటల్లో ఫణి తుపాను తీవ్రత పెరగనుందని, రాగల 12 గంటల్లో తుపాను బలపడి, తమిళనాడు, కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో కేంద్రీకృతం కానుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 30 నుంచి మే 1 వరకూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

తీరం వెంబడి గంటకు 45-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫణి తుపాను కారణంగా మే 2 నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
Go Back to Shorts
Phani cyclone
Tamilnadu
Kosta Andhra
Godavari Districts
Visakhapatnam
Vijayanagaram

More Telugu News