అకాలీదళ్‌ నేత ప్రకాశ్ సింగ్‌ బాదల్‌కు మోదీ పాదాభివందనం

వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నామినేషన్‌ దాఖలు చేసే ముందు అకాలీదళ్‌ నేత ప్రకాశ్ ‌సింగ్‌ బాదల్‌కు పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాళ ఉదయం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లిన మోదీ నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీయే మిత్రపక్షాల నాయకులైన బీహార్‌ సీఎం నితీశ్ ‌కుమార్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌, ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు ప్రకాశ్ ‌సింగ్‌ బాదల్‌ కూడా హాజరై మోదీని అభినందించారు. 


More Telugu News