jashodaben modi: నా భర్త దేశానికి ఎంతో చేశారు: ఓటు వేసిన అనంతరం మోదీ భార్య

ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ లోని ఉంజా పట్టణంలో ఆమె ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం మోదీ ఎంతో చేశారని, మరెంతో చేయబోతున్నారని చెప్పారు. గాంధీనగర్ జిల్లాలో మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గుజారాత్ లో ఈరోజు మొత్తం 26 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి. 
jashodaben modi
modi
bjp

More Telugu News