టీవీలకు అతుక్కుపోయే సంస్కృతిని వదిలేయండి: వెంకయ్యనాయుడు
- బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్-కేర్ హాస్పిటల్స్ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య
- మన జీవనశైలికి శారీరక శ్రమ అవసరమన్న ఉపరాష్ట్రపతి
- మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలంటూ ఆకాంక్ష
స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్- కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతలో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.