నేడు రెండో దశ పోలింగ్.. 95 నియోజకవర్గాల బరిలో 1,611 మంది అభ్యర్థులు
- ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
- తమిళనాట అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కమల్ పార్టీ
- బరిలో పలువురు ప్రముఖులు
కేంద్రమంత్రులు జితేంద్రసింగ్, జ్యుయల్ ఓరం, సదానందగౌడ, పొన్ రాధాకృష్ణన్, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్, ఎ.రాజా, కనిమొళి తదితరులు ఈ దశలోనే ఉన్నారు. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్ప్రదేశ్లో 8, అసోం, బీహార్లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్గఢ్లో 3, పశ్చిమ బెంగాల్లో 3, జమ్ముకశ్మీర్లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో దినకరన్ ఏర్పాటు చేసిన ఏఎంఎంకేతోపాటు నటుడు కమలహాసన్ పార్టీ ఎంఎన్ఎం కూడా పోటీలో వుంది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం శివగంగలోని కరైకుడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.