మోదీని 'జనరల్ డయ్యర్‌'తో పోలుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్

  • మయాపురి ఏరియాలో ఉద్రిక్తత
  • జనాలపై రాళ్ల దాడి
  • పోలీసులు రాళ్లు రువ్వారంటూ ఆగ్రహం
 సుమారు 850 ఫ్యాక్టరీలను మూసివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వాటిని సీల్ చేసేందుకు ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రయత్నించారు. దీంతో న్యూ ఢిల్లీలోని మయాపురి ఏరియాలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకూ, స్థానికులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

ఈ ఘటనలో జనాలపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాని మోదీని జనరల్ డయ్యర్‌తో పోలుస్తూ ట్వీట్ చేశారు. ‘జనరల్ డయ్యర్ మోదీ’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో చేసిన ఈ ట్వీట్‌‌ను, కేజ్రీవాల్ రీ ట్వీట్ చేశారు. పోలీసులు మయాపురి నివాసులపై రాళ్లు రువ్వారంటూ తీవ్ర స్థాయిలో కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Aravind kejriwal
Narendra Modi
General Dayyar
Twitter
Mayapuri
New Delhi

More Telugu News