లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేసిన ఐఎస్‌ఐ: నిఘా వర్గాల వెల్లడి

  • అభ్యర్థులు, పోలింగ్ బూత్‌లు లక్ష్యంగా ప్రణాళిక
  • సరిహద్దు ద్వారా పంపేందుకు యత్నం
  • జమ్ముకశ్మీర్‌‌ను టార్గెట్ చేసినట్టు ప్రకటన
భారత్ లో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేయనుంది. ఈ విషయమై తాజాగా భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో కశ్మీర్ బృందాలకు శిక్షణ ఇచ్చేందుకుగాను ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులను సరిహద్దు ద్వారా పంపేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై ఐఎస్ఐ గురిపెట్టినట్టు తెలిపాయి. దీని కోసం కశ్మీర్ లోయలో జైషే మహ్మద్‌తో పాటు లష్కరే తోయిబా వంటి మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Afghanisthan
ISI
Pakistan
Loksabha
Jammu And Kashmir

More Telugu News