తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్‌ వేసేందుకు బయలుదేరిన నారా లోకేష్‌

  • భారీ ర్యాలీగా తరలిన యువనేత
  • తొలుత ఉండవల్లిలో ప్రత్యేక పూజలు
  • మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ఐటీ మంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌ ఈరోజు నామినేషన్‌ వేయనున్నారు. ఉండవల్లిలోని స్వగృహంలో తొలుత ప్రత్యేక పూజల అనంతరం ఆయన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి పాదాలకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్‌ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా అక్కడ ఉన్నారు. మంగళగిరి నుంచి లోకేష్‌ పార్టీ అభ్యర్థిగా తలపడుతున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Undavalli
nominationa

More Telugu News