Manchu Lakshmi: వీళ్లు భయపడుతున్నారు...!: మంచు లక్ష్మి కామెంట్

  • తిరుపతిలో శాంతియుత ర్యాలీ
  • పోలీసులు భారీగా వచ్చారన్న మోహన్ బాబు
  • 'స్కేర్డ్' పీపుల్ అన్న మంచు లక్ష్మి
ఈ ఉదయం తాను తిరుపతిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నానని, కానీ తన ఇంటి ముందు ఉన్న పోలీసులు, బయటకు వెళ్లేందుకు అంగీకరించబోరేమోనని నటుడు మోహన్ బాబు చేసిన ట్వీట్ పై ఆయన కుమార్తె, నటి మంచు లక్ష్మి స్పందించారు. ట్విట్టర్ లో మోహన్ బాబు ట్వీట్ కు రిప్లయ్ ఇస్తూ, "స్కేర్డ్ పీపుల్" అని వ్యాఖ్యానించారు. మోహన్ బాబును చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందన్న అర్థం వచ్చేలా మంచు లక్ష్మి చేసిన ట్వీట్ వైరల్ కాగా, పలువురు విద్యార్థులకు, మంచు కుటుంబానికి అండగా ఉంటామని రీ ట్వీట్స్ పెడుతున్నారు.
Manchu Lakshmi
Scared People
Mohanbabu

More Telugu News